ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల పేర్లను బుధవారం నాడు ప్రకటించింది. అభ్యర్థుల వివరాలను వైఎస్సార్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి పాలవలస విక్రాంత్, కర్నూలు జిల్లా నుంచి ఇసాక్ బాషా, కడప జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డిలను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంపిక చేసినట్టు తెలిపారు. అలాగే స్థానిక సంస్థల కోటాకు సంబంధించి 11 ఎమ్మెల్సీ స్థానాలకు రెండు, మూడు రోజుల్లోనే సీఎం వైఎస్ జగన్ అభ్యర్థులను ఖరారు చేయనున్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ