దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 200 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో డిసెంబర్ 15, గురువారం ఉదయం 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,75,447 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో 5 మరణాలు (మహారాష్ట్రలో 1, కర్ణాటకలో 1, కేరళలో రికాంసైల్డ్ 3) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,663కి పెరిగింది. ఇక దేశంలో గత 24 గంటల్లో 1,17,735 కరోనా పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజీటివిటీ రేటు 0.17 శాతంగా నమోదైంది.
అలాగే మరో 274 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,41,017 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.80 శాతం గానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో 3,767 (0.01%) మంది చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోనే కొత్త కరోనా కేసుల నమోదు కొంత ఎక్కువుగా ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE