భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2021–2022 సీజన్ కు సంబంధించి ఆటగాళ్ల కొత్త కాంట్రాక్ట్లను ప్రకటించింది. మార్చి 2, బుధవారం నాడు జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కాంట్రాక్ట్లపై నిర్ణయం తీసుకున్నారు. ఏ+, ఏ, బీ, సీ గ్రేడ్ల కింద మొత్తం 27 మంది ఆటగాళ్ల వార్షిక వేతనాల కాంట్రాక్టులను బీసీసీఐ నిర్ణయించింది. ఏడాదికి రూ.7 కోట్లు చొప్పున చెల్లించే ఏ+ గ్రేడ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. ఇక ఏ గ్రేడ్ కింద రూ.5 కోట్లు, బీ గ్రేడ్ కింద రూ.3 కోట్లు, సీ గ్రేడ్ కింద రూ.కోటి చొప్పున ఆటగాళ్లకు చెల్లించనున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.
అయితే గత ఏడాది ‘ఏ’ కాంట్రాక్ట్ లో ఉన్న హార్ధిక్ పాండ్యా, ఓపెనర్ శిఖర్ ధావన్ ను ‘సీ’ కేటగిరికి మార్చారు. అలాగే టెస్టు స్పెషలిస్ట్లు చటేశ్వర్ పుజారా, రహానే, ఇషాంత్ శర్మలను ‘ఏ’ నుంచి ‘బీ’ గ్రేడ్ కు మార్చారు. ఇక మయాంక్ అగర్వాల్, కీపర్ వృద్ధిమాన్ సాహా, భువనేశ్వర్ కుమార్ లను కూడా ‘బీ’ నుంచి ‘సీ’కి మార్చగా, కాంట్రాక్ట్ జాబితా నుంచి కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీలను తప్పించారు.
కొత్త కాంట్రాక్ట్ ల జాబితా:
ఏ+ గ్రేడ్ కాంట్రాక్ట్ (రూ.7 కోట్లు):
- విరాట్ కోహ్లీ
- రోహిత్ శర్మ
- జస్ప్రీత్ బుమ్రా
ఏ గ్రేడ్ కాంట్రాక్ట్ (రూ.5 కోట్లు):
- రవిచంద్రన్ అశ్విన్
- రవీంద్ర జడేజా
- రిషభ్ పంత్
- కేఎల్ రాహుల్
- మహమ్మద్ షమి
బీ గ్రేడ్ కాంట్రాక్ట్ (రూ.3 కోట్లు):
- చటేశ్వర్ పుజారా
- అజింక్య రహానె
- ఇషాంత్ శర్మ
- శ్రేయస్ అయ్యర్
- అక్షర్ పటేల్
- మహ్మద్ సిరాజ్
- శార్దూల్ ఠాకూర్
సీ గ్రేడ్ కాంట్రాక్ట్ (రూ.1 కోటి):
- మయాంక్ అగర్వాల్
- వృద్ధిమాన్ సాహా
- శిఖర్ ధావన్
- హార్ధిక్ పాండ్యా
- భువనేశ్వర్ కుమార్
- ఉమేశ్ యాదవ్
- శుభ్మన్ గిల్
- హనుమ విహారి
- వాషింగ్టన్ సుందర్
- యుజువేంద్ర చాహల్
- దీపక్ చాహర్
- సూర్యకుమార్ యాదవ్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ