సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్స్-2023లో భాగంగా ‘గవర్నర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును పొందిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. “2023 సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్స్లో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ జీకి ‘గవర్నర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించడం మన దేశానికి ఎంతో గర్వకారణం. ఆయనకు అభినందనలు” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ముందుగా కరోనా మహమ్మారి సంక్షోభ పరిస్థితులు మరియు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పలు రంగాలపై ప్రభావం వంటి సమయంలో కూడా దేశంలో మార్కెట్లను సమర్థంగా నడిపించినందుకు గానూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్కు సెంట్రల్ బ్యాంకింగ్ గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రకటించింది. మరోవైపు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ 2015లో దేశం నుంచి తొలిసారిగా ఈ అవార్డును దక్కించుకున్న విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE