ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన కేబినెట్ను పునర్వ్యవస్థీకరించనున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని మంత్రులందరూ శనివారం రాజీనామా చేశారు. తమ రాజీనామాలను తక్షణమే ముఖ్యమంత్రికి సమర్పించాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మంత్రులకు ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒడిశా అసెంబ్లీ స్పీకర్ పదవికి నిరంజన్ పూజారి రాజీనామా చేసిన మరుసటి రోజే వీరి రాజీనామాలు జరిగాయి. కాగా ఆదివారం ఉదయం 11.45 గంటలకు కొత్త మంత్రులతో గవర్నర్ గణేశి లాల్ రాజ్ భవన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జూన్ 20 నుంచి ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్లనున్నందున, ఆయన వెళ్లేలోపు మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించి పోర్ట్ఫోలియోల కేటాయింపు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రాజీనామా చేసిన మంత్రుల్లో సంజయ్ దస్బర్మా, అరుణ్ కుమార్ సాహూ, పుష్పేంద్ర సింగ్డియో, ప్రణబ్ ప్రకాష్ దాస్, సుదామ్ మార్ండి, ప్రదీప్ పాణిగ్రాహి, దేబీ ప్రసాద్ మిశ్రా ఉన్నారు. మరో మంత్రి లాల్ బిహారీ హిమిరికా కూడా రాజీనామా చేసినట్లు సమాచారం. శనివారం రాజీనామా చేసిన మంత్రులను శుక్రవారం రాత్రి వివిధ జిల్లాలకు పార్టీ పరిశీలకులుగా నియమించినట్లు బిజెడి ఒక ప్రకటనలో తెలిపింది. పట్నాయక్కు అత్యంత సన్నిహితుడైన ప్రణబ్ ప్రకాష్ దాస్ను కూడా జనరల్ సెక్రటరీగా నియమించి గిరిజనుల ఆధిపత్యం ఉన్న మల్కన్గిరి మరియు కోరాపుట్ జిల్లాలకు ఇన్ఛార్జ్గా నియమించారు. అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పట్నాయక్.. పార్టీ కోసం పని చేసేందుకు స్వచ్ఛందంగా రాజీనామా చేసిన మంత్రులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF