ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేబినెట్ విస్తరణకు ముందు పలువురు కేంద్ర మంత్రులు, కేంద్ర సహాయమంత్రులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హార్ష్ వర్ధన్, కేంద్ర ప్రసార, సమాచార, అటవీ పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్, కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్, కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోశ్ కుమార్ గంగ్వార్, కేంద్ర రసాయన, ఎరువుల మంత్రి సదానంద గౌడ తమ పదవులకు రాజీనామా చేశారు.
అలాగే విద్యా శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే, మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి దేబశ్రీ చౌదరి, కేంద్ర జల శక్తి సహాయమంత్రి రతన్ లాల్ కటారియా, పర్యావరణం, అటవీ శాఖ సహాయ మంత్రి బాబూలాల్ సుప్రియో, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మరియు మత్స్య, ఎంఎస్ఎంఈ శాఖ సహాయమంత్రి ప్రతాప్ చంద్ర సారంగి కూడా మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ విస్తరణలో పలు కీలక మార్పులు చోటుచేసుబోతున్నట్టు తెలుస్తుంది. మార్పులు, చేర్పులుతో కలిపి ఈ రోజు జరగనున్న కేంద్ర కేబినెట్ విస్తరణలో 43 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ