మార్చి 26 నుంచే ఐపీఎల్-2022 ప్రారంభం

Indian Premier League-2022 will Kick off on March 26 Mumbai and Pune to Host League Matches, Indian Premier League-2022 will Kick off on March 26, Mumbai and Pune to Host League Matches, Indian Premier League-2022, Indian Premier League, 2022 Indian Premier League, 2022 IPL, IPL 2022, IPL will Kick off on March 26, IPL 2022 will Kick off on March 26, Cricket, Cricket Latest News, Cricket Latest Updates, Indian Premier League Latest News, Indian Premier League Latest Updates, IPL, Mango News, Mango News Telugu,

ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ (జీసీ) సమావేశం గురువారం సాయంత్రం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022/15వ సీజన్‌ ను మార్చి 26వ తేదీ నుంచే ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ మీడియాతో మాట్లాడుతూ మార్చి 26వ తేదీనే ఐపీఎల్ 15వ సీజన్‌ను ప్రారంభిస్తామని తెలిపారు.

అలాగే ఈసారి ఐపీఎల్ పూర్తిగా మహారాష్ట్ర రాష్ట్రంలోనే జరుగనుంది. ముంబయిలో 55, పూణేలో 15 మ్యాచ్ లు జరుగనున్నాయి. వాంఖడే స్టేడియంలో 20, బ్రబౌర్న్ స్టేడియంలో 15, నావీ ముంబయిలోని డివై పాటిల్ స్టేడియంలో 20 మరియు పూణే గహుంజేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) గ్రౌండ్‌లో 15 మ్యాచులు జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్లేఆప్స్, ఫైనల్ వేదికలపై ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

ఇక ఐపీఎల్ మ్యాచులకు ప్రేక్షకులను అనుమతించాలని గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారు. అయితే మహారాష్ట్ర ప్రభుత్వ అనుమతికి లోబడి స్టేడియం సామర్థ్యంలో 25 లేదా 50 శాతం మేరకు ప్రేక్షకులను అనుమతించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అలాగే ఫైనల్ 29న నిర్వహించనుండగా, ఐపీఎల్-2022 పూర్తి షెడ్యూల్ ను త్వరలో విడుదల చేయనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =