కామన్ వెల్త్ గేమ్స్-2022 లో భారత్ బోణీ కొట్టింది. కామన్ వెల్త్ గేమ్స్ ప్రారంభమైన రెండో రోజే భారత త్రివర్ణ పతాకం రెపరెపలడింది. వెయిట్ లిప్టింగ్ విభాగం ద్వారా భారత్ ఖాతాలో తోలి పతకం చేరింది. భారత్ వెయిట్ లిఫ్టర్ సంకేత్ మహదేవ్ సర్గర్ రజత పతకం సాధించాడు. పురుషుల 55 కేజీల బరువు విభాగంలో మొత్తం 248 కేజీలు ఎత్తి 21 ఏళ్ల సంకేత్ మహదేవ్ సర్గర్ రజత పతకాన్ని గెలుచుకుని, ఈ ఈవెంట్లో భారత్ కు తొలి పతకాన్ని అందించాడు. మొత్తంగా 248 కిలోలు (స్నాచ్ లో 113, క్లీన్ అండ్ జర్క్లో 135) తో రెండో స్థానంలో నిలవడంతో రజత పతకం కైవసం చేసుకున్నాడు.
ఇక ఈ విభాగంలో మలేషియా వెయిట్లిఫ్టర్ మహ్మద్ అనిక్ 249 కేజీలు (స్నాచ్ లో 107, క్లీన్ అండ్ జర్క్లో 142) ఎత్తి స్వర్ణం పతకం దక్కించుకున్నాడు. శ్రీలంకకు చెందిన దిలంక ఇసురు కుమార 225 కేజీలు (స్నాచ్ లో105, క్లీన్ అండ్ జర్క్లో 120 ) ఎత్తి కాంస్య పతకాన్ని అందుకున్నాడు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY