కరోనాతో ఒక్కరోజే 166 మంది మృతి, మరో 35726 పాజిటివ్ కేసులు నమోదు

Maharashtra Reports 35726 New Covid-19 Cases and 166 Deaths in Last 24 hours

మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా రోజువారీ కరోనా కేసులు 30 వేలకు పైగానే నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కరోనా కేసుల్లో 62 శాతానికిపైగా మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 27, శనివారం కూడా 35,726 కరోనా కేసులు, 166 మరణాలు నమోదయ్యాయి.

దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 26,73,461 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 54,073 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 14,523 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 23,14,579 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 86.58 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.02 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 3,03,475 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు శనివారం నాటికి మహారాష్ట్రలో 1,91,92,750 కరోనా పరీక్షలు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 7 =