కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఎంపీ సోనియా గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం మరోసారి సమన్లు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం జూలై 21న తమ ముందు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. దర్యాప్తు సంస్థ ఇంతకుముందు జూన్ 23న గాంధీకి రెండవ సమన్లు జారీ చేసింది. అయితే, ఈ కేసులో ఈడీ ఎదుట హాజరయ్యేందుకు తొలుత కొద్దిరోజుల గడువు కోరిన సోనియా గాంధీ, ఆ తర్వాత అనుకోకుండా కోవిడ్-19 మరియు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరడం తెలిసిన విషయమే. జూన్ 12 కోవిడ్ అనంతర సమస్యలతో ‘సర్ గంగారామ్’ ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ జూన్ 18న డిశ్చార్జి అయ్యారు.
ఆ తరువాత కూడా కొద్దిరోజులు ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన మేరకు ఆమె ఈడీ ముందు హాజరు కాలేకపోయారు. ఈ నేపథ్యంలో.. విచారణ వాయిదా వేయాలని కోరుతూ జూన్లో సోనియాగాంధీ చేసిన లిఖిత పూర్వక విజ్ఞప్తి చేసింది. అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకునేంత వరకూ కొద్ది వారాల పాటు తన హాజరును వాయిదా వేయాలని సోనియా గాంధీ లేఖలో కోరారు. దీనికి దర్యాప్తు సంస్థ కూడా అంగీకారం తెలిపింది. అయితే ఇదే కేసులో సోనియా కుమారుడు, ఎంపీ రాహుల్ గాంధీ హాజరవగా, ఈడీ సుమారు 50 గంటల పాటు ప్రశ్నించింది. ఈ క్రమంలోనే ఈడీ తాజాగా సోనియాకు సమన్లు పంపింది. జులై 21న తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ