ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి సమీపంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇన్నోవా వాహనం, లారీ ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో, ఇన్నోవాలో ప్రయాణిస్తున్న 9 మంది దుర్మణం చెందారు. మృతులను కర్ణాటకలోని బళ్లారిలో వివాహ వేడుక అనంతరం ఇన్నోవాలో నింబగల్లుకు తిరుగు ప్రయాణమైన కోకా వెంకటప్పనాయుడు, ఆయన బంధువులుగా గుర్తించారు.
కాగా అనంతరపురంలో చోటుచేసుకున్న ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. “ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో అనేకమంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. మరణించిన వారి కుటుంబ సభ్యులకు 2 లక్షలు ఎక్స్ గ్రేషియా పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి చెల్లిస్తామని” ప్రధాని మోదీ ప్రకటించారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ