దేశంలో అన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు వారాణసీలోని జరిగే కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో లబ్ధిదారులు మరియు వ్యాక్సినేటర్లతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. “ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ భారతదేశంలో జరుగుతోంది. మన ఫ్రంట్లైన్ యోధులకు దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ వేస్తున్నారు. రేపు అనగా జనవరి 22 మధ్యాహ్నం 1:15 గంటలకు, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వారణాసిలోని కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో లబ్ధిదారులు మరియు వ్యాక్సినేటర్లతో నేను సంభాషిస్తాను. ఈ ముఖాముఖి వారి అనుభవాలను మరియు అభిప్రాయాన్ని వినడానికి మొదటి అవకాశాన్ని ఇస్తుంది. రేపటి ముఖాముఖిని మీరందరూ చూడాలని నేను కోరుతున్నాను” ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ