ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 16, శనివారం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా యూపీలోని జలౌన్ జిల్లా ఒరై తహసిల్లోని కైతేరి గ్రామంలో శనివారం ఉదయం 11:30 గంటలకు ప్రతిష్టాత్మక “బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే” ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా కనెక్టివిటీని పెంపొందించడం, రోడ్డు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో భాగంగా ఫిబ్రవరి 29, 2020న బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్వే నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ఎక్స్ప్రెస్వే పనులు 28 నెలల్లో పూర్తికాగా, ఇప్పుడు దానిని ప్రధాని ప్రారంభించనున్నారు.
ఉత్తరప్రదేశ్ ఎక్స్ప్రెస్వేస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో సుమారు రూ.14,850 కోట్లతో 296 కి.మీ మేర నాలుగు లేన్ల ఎక్స్ప్రెస్వే నిర్మించబడింది, దీన్ని అవసరాన్ని బట్టి తరువాత ఆరు లేన్ల వరకు కూడా విస్తరించే అవకాశం ఉంది. ఇది చిత్రకూట్ జిల్లాలోని భరత్ కూప్ సమీపంలోని గోండా గ్రామం వద్ద నేషనల్ హైవే-35 నుండి ఎటావా జిల్లాలోని కుడ్రైల్ గ్రామం వరకు విస్తరించి ఉంది, ఇక్కడ అది ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేతో కలిసిపోతుంది. ఈ ఎక్స్ప్రెస్వే చిత్రకూట్, బందా, మహోబా, హమీర్పూర్, జలౌన్, ఔరైయా మరియు ఇటావా వంటి ఏడు జిల్లాల గుండా వెళ్లనుంది. ఈ ప్రాంతంలో కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటుగా, బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్వే ఆర్థిక అభివృద్ధికి పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుందని, ఫలితంగా స్థానిక ప్రజలకు వేలాది ఉద్యోగాలు ఏర్పడతాయని భావిస్తున్నారు. మరోవైపు ఎక్స్ప్రెస్వే పక్కనే ఉన్న బందా, జలౌన్ జిల్లాల్లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు సంబంధించిన పనులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY