ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు (జూన్ 7, సోమవారం) సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని ప్రధానిమంత్రి కార్యాలయం ట్వీట్ చేసి వెల్లడించింది. “ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు” అని ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే ఏ అంశంపై మాట్లాడనున్నారు అనే విషయాన్ని వెల్లడించలేదు. దేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక పలుమార్లు ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన సంగతి తెలిసిందే.
తీవ్రస్థాయి కరోనా సెకండ్ వేవ్ విజృంభణ అనంతరం, గతకొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. అయితే కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగం పెంచడం, రాష్ట్రాలు అన్ లాక్ బాటపట్టనుండడం, వైద్యనిపుణులు కరోనా థర్డ్ వేవ్ పై హెచ్చరిక జారీచేస్తున్న నేపథ్యంలో కరోనా కట్టడి, నియంత్రణ చర్యల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రధాని ప్రసంగం ఉండే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
మరోవైపు సోమవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2,89,09,975 కు, మరణాల సంఖ్య 3,49,186 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో దాదాపు 61 రోజుల తర్వాత అతి తక్కువుగా(1,00,636) ఈ రోజు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రసంగంలో పలు అంశాల గురించి ప్రజలకు ప్రధాని మోదీ వివరించే అవకాశమున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ