ప్రముఖ యువనటుడు సాయిధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నగరంలోని కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి ఐకియా వైపు స్పోర్ట్స్ బైక్పై వెళ్తుండగా బైక్ అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ఘటనలో సాయిధరమ్ తేజ్కు గాయాలు కాగా, ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి శనివారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
“సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. అన్ని ప్రధాన అవయవాలు బాగానే పని చేస్తున్నాయి. క్లోజ్ అబ్జర్వేషన్ కోసం ఐసీయూలోనే ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నాం. ఈ రోజు మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. అలాగే సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై రేపు మరొకసారి హెల్త్ బులిటెన్ విడుదల చేస్తాం” అని అపోలో ఆసుపత్రి వర్గాలు బులెటిన్ లో వెల్లడించాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ