హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్ గా బండారు దత్తాత్రేయ ప్రమాణం

Bandaru Dattatreya As Himachal Pradesh Governor, Bandaru Dattatreya Sworned As A Governor, Bandaru Dattatreya Takes Oath As Governor Of Himachal Pradesh, Bandaru Dattatreya Takes Oath As Himachal Pradesh Governor, Bandaru Dattatreya Takes Oath As HP Governor, Mango News Telugu, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2019

బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ను హిమాచల్‌ప్రదేశ్‌‌ గవర్నర్ గా కేంద్రప్రభుత్వం నియమించగా, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్ గా బండారు దత్తాత్రేయ సెప్టెంబర్ 11, బుధవారం ఉదయం ప్రమాణం స్వీకారం చేసారు. ఆయన చేత హిమాచల్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయించారు, సిమ్లాలోని రాజ్ భవన్ లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, రాష్ట్ర మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, తెలంగాణ ప్రాంత బీజేపీ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరై బండారు దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలియజేసారు.

మరో వైపు బండారు దత్తాత్రేయకు సెప్టెంబర్ 13వ తేదీన రవీంద్రభారతీలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్మానసభ నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్, బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, టీజేఎస్ అధ్యక్షుడు కోదండ రామ్ తదితరులు హాజరవుతారని తెలిపారు.

 

[subscribe]
[youtube_video videoid=6F7gXXQBuyI]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + thirteen =