తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ బుధవారం సాయంత్రం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్, ఈటల రాజేందర్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బండి సంజయ్ ఆగస్టు 9 నుండి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి అమిత్ షా సహా పలువురు నేతలను ఆహ్వానించే అవకాశమునట్టు సమాచారం. మరోవైపు బీజేపీ పార్టీలో చేరాక ఈటల రాజేందర్ తొలిసారిగా అమిత్ షాను కలవనున్నారు. ఈ భేటీ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, హుజురాబాద్ లో ఉపఎన్నికతో పాటుగా పలు కీలక అంశాలను చర్చించే అవకాశముంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ