బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను జనగామ జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. ముందుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై నిరసన తెలిపిన బీజేపీ నేతలను, కార్యకర్తలను అరెస్టు చేసి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని, అందుకు నిరసనగా ధర్మదీక్షను చేపడుతున్నట్టు బండి సంజయ్ ప్రకటించారు. ఈ క్రమంలో ప్రజాసంగ్రామ యాత్రలో బసచేసిన చోటే, మంగళవారం ఉదయం స్టేషన్ఘన్పూర్ మండలం పామ్నూర్లో బండి సంజయ్ దీక్ష తలపెట్టగా పోలీసులు భగ్నం చేశారు.
పోలీసులు మోహరించడంతో దీక్ష శిబిరం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్ ను అదుపులోకి తీసుకోకుండా బీజేపీ కార్యకర్తలు, సంగ్రామసేన కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ క్రమంలో వారి మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఉద్రిక్త పరిస్థితుల మధ్యనే పోలీసులు బండి సంజయ్ ను అదుపులోకి తీసుకుని వాహనంలోకి ఎక్కించారు. పోలీసు వాహనాన్ని కూడా బీజేపీ శ్రేణులు అడ్డుకున్నాయి. మరోవైపు బండి సంజయ్ అరెస్ట్ పై బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. మరికాసేపట్లో భవిష్యత్ కార్యాచరణపై బీజేపీ నేతలు ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఇక మంగళవారం ఉదయం బండి సంజయ్ ట్వీట్ చేస్తూ, మద్యం కుంభకోణం ఆరోపణలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద ఆందోళన చేస్తున్న బీజేపీ నేతలపై టీఎస్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గాయపడిన బీజేపీ నేతలను వెంటనే ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలన్నారు. కార్యకర్తలపై పోలీసుల చర్యకు నిరసనగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ తెలంగాణ ఆందోళన చేపట్టనుందని బండి సంజయ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY