తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రెండో రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం నాడు కేంద్ర విమానయాన, హోసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆరు చోట్ల కొత్త ఎయిర్పోర్టుల ఏర్పాటు అంశంపై చర్చించి, కేంద్రమంత్రికి ఓ లేఖను అందజేశారు. రాష్ట్రంలో విమానాశ్రయాల ఏర్పాటుపై 2018 లోనే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆ సైట్స్ లో అబ్ స్టాకిల్ లిమిటేషన్ సర్ఫేస్ సర్వే, సాయిల్ టెస్ట్, ఇతర పరిశీలన చేశాయని, ఇటీవలే డ్రాఫ్ట్ రిపోర్టులు వచ్చాయని ఇంకా ఫైనల్ రిపోర్ట్స్ రావాల్సి ఉందని చెప్పారు.
పెద్దపల్లి జిల్లాలో బసంత్నగర్, వరంగల్ అర్బన్ జిల్లాలో మామునూర్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో, నిజామాబాద్ జిల్లాలో జక్రాన్పల్లి, మహబూబ్నగర్ జిల్లాలో దేవరకద్ర, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో విమానాశ్రయాలు ఏర్పాటుకు అన్ని అవసరమైన అనుమతులను సింగిల్ విండో ప్రాతిపదికన ఇవ్వాలని కేంద్రమంత్రికి ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ