రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకోసం రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) ఉమ్మడి ప్రవేశ పరీక్ష-2020 ను డిసెంబర్ 5 వ తేదీన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు 85,760 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం నాడు ఆర్జీయూకేటీ సెట్-2020 పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో విడుదల చేశారు. ఫలితాలను http://www.rgukt.in/ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. జనవరి 4 నుంచి కౌన్సెలింగ్, 18 వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయని మంత్రి వెల్లడించారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఏపీలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లలో అడ్మిషన్స్ చేపట్టనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ