టీఎన్జీవో, టీజీవో, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం, రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ల డైరీలు, క్యాలెండర్లను గురువారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మామిండ్ల రాజేందర్, ప్రతాప్, టీజీవోల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వి.మమత, సత్యనారాయణ, నాలుగో తరగతి ఉద్యోగల సంఘం నాయకులు జ్ఞానేశ్వర్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వంగ రవీందర్ రెడ్డి, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
మరోవైపు గురువారం నాడు ప్రగతిభవన్లో టీఎన్జీవో, టీజీవో సహా ఇతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చలు జరిపారు. పీఆర్సీ, ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలు, ఇతర ఉద్యోగ సమస్యలపై త్వరితగతిన నిర్ణయం తీసుంటామని సీఎం కేసీఆర్ వెల్లడించినట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ