జనవరి 1, 2021 నుండి దేశంలోని అన్ని 4 చక్రాల వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తున్నట్లుగా ఇటీవల కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఫాస్టాగ్ ద్వారా జాతీయ రహదారులపై (నేషనల్ హైవే) టోల్ ఛార్జీలు వసూలు విధానాన్ని తప్పనిసరి చేసే గడువును ఫిబ్రవరి 15, 2021 వరకు పొడిగిస్తునట్టు కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ గురువారం నాడు ప్రకటించింది. ముందుగా దేశంలో టోల్గేట్ల వద్ద ట్రాఫిక్ను నియంత్రించడంతో పాటుగా, డిజిటల్, ఐటి ఆధారిత చెల్లింపులను ప్రోత్సహించే లక్ష్యంతో 2016 లో ఫాస్టాగ్ విధానాన్ని ప్రారంభించారు. ఇక డిసెంబర్ 1, 2017 నుండి కొత్త నాలుగు చక్రాల వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఫాస్టాగ్ ను తప్పనిసరి చేసిన కేంద్రం, 1989 నాటి మోటారు వాహన చట్టంలో మార్పులు చేస్తూ డిసెంబర్ 1, 2017 కంటే ముందు కొనుగోలు చేసిన 4 చక్రాల పాత వాహనాలకు కూడా ఫాస్టాగ్ తప్పనిసరి చేస్తూ ఇటీవలే ఉత్తర్వులు ఇచ్చింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ