తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 26, శనివారం నాడు ప్రగతి భవన్ లో మంత్రులు, జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీపీవోలతో, పలు శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. జూలై 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పల్లెప్రగతి, పట్టణప్రగతి, హరితహారం కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలు, చేపట్టాల్సిన పనులు, అభివృద్ధి అంశాలపై అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్దే లక్ష్యంగా చేపట్టబోయే కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ