హైదరాబాద్ నగరంలో గండిపేట ప్రాంతంలోని ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ ఆలయాన్ని మార్చ్ 19వ తేదీ నుంచి మూసివేయనున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా చిలుకూరు బాలాజీ ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయాలని ఆలయ ప్రధాన అర్చకులు నిర్ణయించారు. మార్చ్ 25వ తేదీ వరకు ఆలయాన్ని మూసి వేయనున్నారు. మరోవైపు ఇప్పటికే నగరంలోని చారిత్రక స్థలాలైనా గోల్కొండ కోట, చార్మినార్ లను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే జూ పార్కు, లుంబినీ, ఎన్టీఆర్ పార్కులు, ఇతర ప్రముఖ ప్రదర్శనశాలలు కూడా మూతపడ్డాయి. అదే విధంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ పరిధిలో ఉన్న అన్ని హాస్టళ్లను, ఐటీ కోచింగ్ సెంటర్లను కూడా మార్చ్ 31 దాకా మూసి వేయాలని జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ గీతా రాధిక ఆదేశించారు. హాస్టళ్లను మూసివేసి విద్యార్థులను సొంత గ్రామాలకు పంపించాల్సిందిగా ఆమె సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 6 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ నేపథ్యంలో ముందుగానే అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి పలు చర్యలు చేపడుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలను మార్చ్ 31 వరకు మూసివేయాలని ఆదేశాలిచ్చారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ను కూడా మూసివేయాలని ప్రకటించారు.
ఈ అంశానికి సంబంధించిన మరికొన్ని వార్తలు:
కరోనా వైరస్ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలి – పవన్ కళ్యాణ్
కరోనా ఎఫెక్ట్: తన పుట్టిన రోజు వేడుకలు జరపవద్దన్న రామ్ చరణ్
కరోనా ఎఫెక్ట్: షిరిడీ ఆలయం, తాజ్ మహల్ మూసివేత
కరోనా ఎఫెక్ట్: రైల్వే ప్లాట్ఫామ్ టికెట్ ధర పెంపు
దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం
కరోనా వైరస్ ముప్పు – కరోనా వైరస్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కరోనా అలర్ట్: పోస్టర్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం