దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైల్వే ప్లాట్ఫామ్ లపై రద్దీని తగ్గించి కరోనా వైరస్ వ్యాప్తిని నివారించే ప్రయత్నంలో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వెస్ట్రన్ రైల్వే మరియు సెంట్రల్ రైల్వే పరిధిలోని 250 స్టేషన్లలో ప్లాట్ఫాం టికెట్ ధరను రూ.10 నుండి రూ.50 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకునట్టు ఒక రైల్వే అధికారి తెలిపారు. కరోనావైరస్ సమస్యను దృష్టిలో ఉంచుకుని ప్లాట్ఫామ్ లపై అనవసర రద్దీని నియంత్రించేందుకే ప్లాట్ఫాం టికెట్ ఛార్జీలు పెంచబడ్డాయని పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పెంచిన ధరలు అమల్లో ఉంటాయని తెలిపారు. అలాగే మార్చ్ 17, మంగళవారం నుంచి దేశంలోని పలు రైల్వే స్టేషన్స్ లో స్వచ్చంద ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ చెక్ కూడా ప్రారంభించారు.
ఈ అంశానికి సంబంధించిన మరికొన్ని వార్తలు:
కరోనా ఎఫెక్ట్: షిరిడీ ఆలయం, తాజ్ మహల్ మూసివేత
దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం
కరోనా వైరస్ ముప్పు – కరోనా వైరస్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కరోనా అలర్ట్: పోస్టర్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం