తెలంగాణ రాష్ట్రంలో మార్చ్ 2న మొదటి కరోనా కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని మహేంద్రహిల్స్ కు చెందిన యువకుడు దుబాయ్ నుంచి బెంగుళూరు మీదుగా నగరానికి వచ్చాడు. అతనికి కరోనా టెస్టులో పాజిటివ్ రావడంతో గాంధీ ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులో ఉంచి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆ యువకుడు కోలుకుంటున్నట్లు సమాచారం. అతని తాజా వైద్య పరీక్షల నమూనా రిపోర్టులో నెగటివ్ వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. అతని ఆరోగ్య పరిస్థితి మెరుగైందని జ్వరం కూడా తగ్గిందని వైద్యులు వెల్లడించారు.
రానున్న 48 గంటల్లో మరోసారి అతని నమూనాలు సేకరించి, పుణే వైరాలజీ ల్యాబ్కు పంపించి మరోసారి కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. వైరస్ లక్షణాలు పూర్తిగా తగ్గినట్లు నిర్ధారించుకకున్నాక అతన్ని ఆస్పత్రి నుంచి హోం ఐసోలేషన్కు తరలించే అవకాశం ఉంది. మరో వైపు వ్యాధి లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం 32 మంది చికిత్స పొందుతున్నారు. వీరిని కూడా రెండ్రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించే అవకాశం ఉంది.
ఈ అంశానికి సంబంధించిన మరికొన్ని వార్తలు:
తెలంగాణ, ఢిల్లీలలో కరోనా కేసులు నమోదు
కరోనా అలర్ట్: పోస్టర్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
[subscribe]