కరోనా: తెలంగాణలో 33 వేలు దాటిన పాజిటివ్ కేసులు, 348 కి పెరిగిన మరణాలు

Coronavirus, Coronavirus Latest News, COVID-19, COVID-19 in Telangana, telangana, Telangana Corona Updates, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases

తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతోంది. రాష్ట్రంలో మరో 1178 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 11, శనివారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 33,402 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శనివారం నాడు 11,062 శాంపిల్స్ పరీక్షించగా 9884 మందికి నెగటివ్ వచ్చినట్టుగా పేర్కొన్నారు. అలాగే కరోనా వలన మరో 9 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 348 కి పెరిగింది. కోవిడ్ నుంచి మరో 1714 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 20,919 కి చేరింది. ప్రస్తుతం 12,135 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.

రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1178):

  1. జీహెచ్‌ఎంసీ ఏరియా – 736
  2. రంగారెడ్డి – 125
  3. మేడ్చల్ – 101
  4. రాజన్న సిరిసిల్ల – 24
  5. కరీంనగర్ – 24
  6. వరంగల్ అర్బన్ – 20
  7. మెదక్ – 16
  8. సంగారెడ్డి – 13
  9. మహబూబ్ నగర్ – 12
  10. పెద్దపల్లి – 12
  11. నల్గొండ – 12
  12. నిజామాబాద్ – 12
  13. యాదాద్రి – 9
  14. వికారాబాద్ – 9
  15. సిద్ధిపేట – 9
  16. ఆదిలాబాద్ – 8
  17. సూర్యాపేట – 7
  18. గద్వాల్ – 6
  19. నారాయణపేట్ – 5
  20. మంచిర్యాల – 5
  21. ఖమ్మం – 2
  22. వరంగల్ రూరల్ – 2
  23. నిర్మల్ – 2
  24. జగిత్యాల – 2
  25. జనగామ – 2
  26. వనపర్తి – 2
  27. ఆసిఫాబాద్ -1

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =