తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1256 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 9, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 80,751 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఆదివారం నాడు 11,609 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 10 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 637 కి పెరిగింది. ఇప్పటివరకు 57,586 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 22,528 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 71.31 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.78 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1256):
- జీహెచ్ఎంసీ – 389
- రంగారెడ్డి – 86
- మేడ్చల్ – 138
- సంగారెడ్డి – 74
- కరీంనగర్ – 73
- వరంగల్ అర్బన్ – 67
- ఆదిలాబాద్ – 63
- నల్గొండ – 58
- సిద్ధిపేట – 45
- నాగర్ కర్నూల్ – 38
- మేడ్చల్ – 34
- రాజన్న సిరిసిల్ల – 31
- ఖమ్మం – 28
- పెద్దపల్లి – 23
- మహబూబ్ నగర్ – 21
- సూర్యాపేట – 20
- జనగామ – 20
- మహబూబాబాద్ – 19
- నిర్మల్ – 19
- జోగులాంబ గద్వాల్ – 14
- జగిత్యాల – 13
- నారాయణ్ పేట్ – 12
- వనపర్తి – 12
- మంచిర్యాల – 11
- వరంగల్ రూరల్ – 11
- మెదక్ – 9
- కామారెడ్డి – 8
- భద్రాద్రి కొత్తగూడెం – 7
- వికారాబాద్ – 6
- జయశంకర్ భూపాలపల్లి – 6
- ములుగు – 3
- యాదాద్రి భువనగిరి – 3
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu