మాజీ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం నాడు తన నియోజకవర్గమైన హుజూరాబాద్ లో పర్యటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుండి కమలాపూర్ కు వచ్చిన ఈటల రాజేందర్ కు అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కమలాపూర్ వరకు పెద్దఎత్తున ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. శుంభుని పల్లి, కమలాపూర్, కానిపర్తిలలో ఈటల రోడ్షో నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తునట్టు ఈటల రాజేందర్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజీనామా అనంతరం తొలిసారిగా కమలాపూర్ చేరుకున్న ఆయనకు గ్రామ ప్రజలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. హుజురాబాద్ లో ఈటల పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు జూన్ 13న లేదా జూన్ 14న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల బీజేపీలో చేరనున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ