తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పెద్ద ఎత్తున ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు. అటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలివస్తున్నారు. బంజారాహిల్స్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఓటు హక్కును వినియోగించుకున్నారు. యువతీ యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కవిత సూచించారు.
అటు స్పీకర్, బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస రెడ్డి.. స్వగ్రామం పోచారంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పర్వతగిరిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటు వేశారు. కూకట్పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎల్లపల్లిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నారాయణపురంలో, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సత్తుపల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరీంనగర్లో బండి సంజయ్ ఓటు వేశారు.
అటు సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్లోని పోలింగ్బూత్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్లోని ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్లో కుటుంబ సభ్యులతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ ఓటు వేశారు. సినీ నటుడు వెంకటేష్, దర్శకుడు తేజ కూడా జూబ్లీహిల్స్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు అల్లు అర్జున్ సామాన్యుడిలా క్యూ లైన్లో నిలబడి సామాన్యుడిలా ఓటు వేశారు. సినీ నటుడు నితిన్ జూబ్లీహిల్స్ క్లబ్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు హీరో శ్రీకాంత్, దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా హైదరాబాద్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE