తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మార్చి 13వ తేదీన పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ మూడు జిల్లాల పరిధిలోని రెండ్రోజుల పాటుగా మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈ మూడు జిల్లాల్లో మార్చి 11, శనివారం సాయంత్రం 4 గంటల నుండి మార్చి 13, సోమవారం సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లు నడిపే బార్లు, స్టార్ హోటల్స్ లో బార్లు, రిజిస్టర్డ్ క్లబ్స్ మూసేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పోలీసులు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. దీంతో హైదరాబాద్, సికింద్రాబాద్ సహా మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లా పరిధిల్లో 48 గంటల పాటుగా మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.
మరోవైపు మహబూబ్నగర్-రంగా రెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక ప్రచార గడువు శనివారం సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. కాగా మార్చి 13, సోమవారం ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 4.00 వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల కోసం మొత్తం 137 పోలింగ్ స్టేషన్లను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఇక మార్చి 16వ తేదీన ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నట్టు ఈసీ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE