టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆ మూడు జిల్లాల్లో రెండ్రోజులు మద్యం దుకాణాలు బంద్

Mahabubnagar-Rangareddy-Hyderabad Teachers MLC Election: Wine Shops will be Closed from March 11th 4PM to March 13th 4 PM,Mahabubnagar and Rangareddy MLC Election,Hyderabad Teachers MLC Election,Mahabubnagar Teachers MLC Election,Rangareddy Teachers MLC Election,Wine Shops Closed from March 11th,Mango News,Mango News Telugu,Wine Shops will be Closed For Two Days,Liquor Shops Closed,MLC Elections,Leave For State,Central Employees For MLC Elections,Telangana Political News And Updates,Hyderabad News,Telangana News And Live Updates,Mahabubnagar News,Rangareddy Latest Updates

తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మార్చి 13వ తేదీన పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ మూడు జిల్లాల పరిధిలోని రెండ్రోజుల పాటుగా మద్యం దుకాణాలను మూసివేయ‌నున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈ మూడు జిల్లాల్లో మార్చి 11, శనివారం సాయంత్రం 4 గంటల నుండి మార్చి 13, సోమవారం సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లు నడిపే బార్లు, స్టార్ హోటల్స్ లో బార్లు, రిజిస్టర్డ్ క్లబ్స్ మూసేయాలని ఎక్సైజ్‌ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పోలీసులు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. దీంతో హైదరాబాద్, సికింద్రాబాద్ సహా మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లా పరిధిల్లో 48 గంటల పాటుగా మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.

మరోవైపు మహబూబ్‌నగర్-రంగా రెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక ప్రచార గడువు శనివారం సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. కాగా మార్చి 13, సోమవారం ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 4.00 వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల కోసం మొత్తం 137 పోలింగ్‌ స్టేషన్లను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఇక మార్చి 16వ తేదీన ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నట్టు ఈసీ వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 17 =