తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 2290 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎం మిషన్లలో నిక్షిప్తమయింది. డిసెంబర్ 3న అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రానుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అటు పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఏ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటుందనే దానిపై పలు సంస్థలు సర్వే చేసి సంచలన నివేదికలను బయటపెడుతున్నాయి.
మ్యాంగ్ న్యూస్ సర్వే నివేదిక ప్రకారం.. బీఆర్ఎస్ 48-58 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉంది. కాంగ్రెస్ 58-67 స్థానాల్లో గెలుపొందే ఛాన్స్ ఉంది. బీజేపీ 7-13 స్థానాల్లో, ఎంఐఎం 6-7 స్థానాల్లో, ఇతరులు 6-8 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని మ్యాంగో న్యూస్ నివేదికలో తేలింది.
సీఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. బీఆర్ఎస్ 48, కాంగ్రెస్ 56, బీజేపీ 10, ఎంఐఎం 5 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉంది. సీ-ప్యాక్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. బీఆర్ఎస్ 41, కాంగ్రెస్ 65, బీజేపీ 4, ఇతరులు 9 స్థానాలు కైవసం చేసుకునే చాన్స్ ఉంది. జనం సాక్షి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. బీఆర్ఎస్ 26-37, కాంగ్రెస్ 66-77, బీజేపీ 4-9, ఎంఐఎం 6-7, ఇతరులు 0-1 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉంది. బీఆర్ఎస్ 40-55 స్థానాల్లో, కాంగ్రెస్ 48-64 స్థానాల్లో బీజేపీ 7-13 స్థానాల్లో ఎంఐఎం 4-7 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్స్లో వెల్లడయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE