తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినప్పటికీ.. అధికారులు వెంటనే అప్రమత్తమై వాటిని సరి చేశారు. కొన్ని చోట్ల స్వల్ప ఘటనలు మినహా.. రాష్ట్రమంతటా సజావుగా పోలింగ్ జరుగుతోంది. పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు. యువతీ యువకులు, కొత్తగా ఓటు హక్కు వచ్చినవారు.. ఉత్సాహంతో ఓట్లు వేసేందుకు తరలివస్తున్నారు. పట్టణాలతో పోలిస్తే.. గ్రామీణప్రాంతాల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంది. అర్బన్ ఏరియాల్లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది.
ఈసారి ఓటర్ల నుంచి మంచి స్పందన వస్తోందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ వెల్లడించారు. యువతీ యువకులు ఓటు వేసేందుకు ఉత్సాహంగా ముందుకొస్తున్నారన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక సమస్యలతో బాదపడుతున్న వాళ్లు కూడా.. ఓటేసేందుకు తరలివస్తున్నారని వెల్లడించారు. సాంకేతికర సమస్యలు తలెత్తిన కొన్ని చోట్ల ఈవీఎంలను మార్చామని అన్నారు. ఓటరు కార్డే కాకుండా.. ఆధార్, పాన్తో పాటు తదితర 12 గుర్తింపు కార్డులను అనుమతిస్తున్నామని వికాస్ రాజ్ తెలిపారు.
గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే.. అర్భన్ ఏరియాల్లో పోలింగ్ నెమ్మదిగా కొనసాగుతోందని వికాస్ రాజ్ వెల్లడించారు. మధ్యాహ్నం నుంచి అర్భన్ ఏరియాల్లో పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఎమ్మెల్సీ కవిత, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోదరుడిపై ఫిర్యాదులు అందాయని వివరించారు. ఆ ఫిర్యాదులపై దర్యాప్తు జరుపుతున్నామని వికాస్ రాజ్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE