ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో నేటి (జనవరి 17, సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని రకాల విద్యా సంస్థలకు జనవరి 30వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ కేబినేట్ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, తదితర విషయాల మీద చర్చించనున్నట్టు తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల్లో వసతులు, వ్యాక్సినేషన్ పక్రియతో పాటుగా వ్యవసాయ రంగంపై కూడా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ