తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సెప్టెంబర్ 7, సోమవారం రాత్రి 7.30 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. కొత్తగా రూపొందించిన రెవెన్యూ చట్టాలతో పాటు శాసనసభలో ప్రవేశపెట్టాల్సిన ఇతర బిల్లులపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులు, పలు ఇతర అంశాలపై ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu