తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్,2022లో జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు తాజాగా మరోసారి పొడిగించింది. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు, జనరల్ మరియు ఒకేషనల్ కోర్సుల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు, హాజరు మినహాయింపు పొందిన ప్రైవేట్ అభ్యర్థులు ఏప్రిల్,2022 వార్షిక పరీక్షల కోసం ఎలాంటి ఆలస్య ఫీజు లేకుండా ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది.
అలాగే రూ.200 ఆలస్య ఫీజుతో ఫిబ్రవరి 16 వరకు, రూ.1000 ఆలస్య ఫీజుతో ఫిబ్రవరి 23 వరకు, రూ.2000 ఆలస్య ఫీజుతో మార్చి 3 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు శుక్రవారం నాడు ప్రకటన విడుదల చేసింది. మరోవైపు గత అక్టోబర్ లో నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో పాసైన విద్యార్థులు తమ మార్కులు పెంచుకునేందుకు (ఇంప్రూవ్ మెంట్) ఏప్రిల్ లో ప్రథమ సంవత్సరం పరీక్షలకు హాజరు కావొచ్చని గతంలోనే తెలిపిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ