తెలంగాణ రాష్ట్రంలో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్/ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2022 ను జూన్ 12న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎస్ టెట్-2022 ఫలితాలు విడుదల అయ్యాయి. టెట్ కన్వీనర్ రాధారెడ్డి ఈ ఫలితాలను శుక్రవారం ఉదయం విడుదల చేశారు. టెట్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్సైట్ www.tstet.cgg.gov.in లో చూసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 12న నిర్వహించిన టెట్ పరీక్షల్లో భాగంగా పేపర్-1 కు 3,18,506 మంది, పేపర్-2 కు 2,51,070 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
మరోవైపు టెట్-2022 పరీక్షల నిర్వహణ అనంతరం ముందుగా ప్రైమరీ కీ ని విడుదల చేసి, అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. ఆ తరువాత ఫైనల్ కీ కూడా విడుదల చేశారు. ఇటీవల విద్యాశాఖ పనితీరుపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆ సందర్భంగా టెట్ ఫలితాల వెల్లడిలో జాప్యానికి ఆస్కారం లేకుండా జూలై 1న విడుదల చేయాలని అధికారులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే నేడు టెట్ ఫలితాలు విడుదల అయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY