బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కు తాజాగా రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మార్చి 15వ తేదీన ఉదయం 11 గంటలకు కమిషన్ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని మహిళా కమిషన్ నోటీసుల్లో పేర్కొంది. ముందుగా ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించి, నోటీసులు జారీ చేయనున్నట్టు తెలిపింది. మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆ వ్యాఖ్యలపై వివరణ కోరేందుకు బండి సంజయ్ కు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE