బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆదివారం నాడు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. అమిత్ షాతో భేటీ అయిన వారిలో ఈటల రాజేందర్ వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి కూడా ఉన్నారు. అనంతరం ఈ భేటీపై ఈటల రాజేందర్ స్పందిస్తూ, “అమిత్ షాతో మీటింగ్ ఫలప్రదంగా జరిగింది. తెలంగాణలో బీజేపీనీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపైనా చర్చ జరిగింది” అని పేర్కొన్నారు.
గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలు రాష్ట్రనేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షాతో ఈటల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈటలను ఢిల్లీకి పిలిపించుకొని పలు అంశాలపై చర్చించడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. మరోవైపు రాష్ట్రంలో ఈటలకు కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో బీజేపీ అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY