తెలంగాణలో ఆరు ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రిప్ లను మంజూరు చేయండి : సీఎం కేసీఆర్

Civil Aviation Secretary, CM KCR Meet Civil Aviation Secretary Pradeep Singh Kharola, Mango News, Pradeep Singh Kharola, Pradeep Singh Kharola Meets CM KCR, Pragathi Bhavan, Telangana CM KCR, Union Civil Aviation Secretary Pradeep Singh, Union Civil Aviation Secretary Pradeep Singh Kharola Meets CM KCR, Union Civil Aviation Secretary Pradeep Singh Kharola Meets CM KCR at Pragathi Bhavan

కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా ప్రగతి భవన్ లో శనివారం నాడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వరంగల్ జిల్లా మామునూరులో, పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ లో, ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో, నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లిలో, మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో ఈ ఆరు ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రిప్ లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందుకు సంబంధించి ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తులు చేసిన నేపథ్యంలో వాటి సత్వర మంజూరు కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా పౌర విమానయాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలాని ఈ భేటీ సందర్భంగా సీఎం కేసీఆర్ కోరారు. కాగా రాష్ట్రంలో ఎయిర్ స్ట్రిప్ ల మంజూరీ కోసం తాను కృషి చేస్తానని ప్రదీప్ సింగ్ ఖరోలా సీఎంకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, ఈఎన్సీ రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + eighteen =