వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం నాడు కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ నియోజకవర్గం, ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో నిరుద్యోగుల కోసం నిరాహారదీక్ష చేపట్టారు. ముందుగా సిరిసేడు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి మొహ్మద్ షబ్బీర్ కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించారు. షబ్బీర్ కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్చారు. అనంతరం సిరిసేడు గ్రామంలో ఏర్పాటు చేసిన నిరుద్యోగ దీక్షాస్థలికి చేరుకుని, దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి, నిరాహార దీక్షలో కూర్చొన్నారు. సిరిసేడు గ్రామంలో వైఎస్ షర్మిల దీక్ష సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగులు పాల్గొన్నారు
ముందుగా ప్రతి మంగళవారం నిరుద్యోగవారంగా పరిగణించి రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం నిరాహారదీక్ష చేపట్టాలని వైఎస్ షర్మిల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే జూలై 13 వనపర్తి నియోజకవర్గంలోని తాడిపత్రి గ్రామంలో, జూలై 20న ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గంలోని పెనుబల్లిలో, జూలై 27న నల్గొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గంలోని పుల్లెంల గ్రామంలో, ఆగస్టు 3న రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ నియోజకవర్గంలోని గొల్లపల్లె గ్రామంలో వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్షను చేపట్టారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ