ఖమ్మం జిల్లా పెనుబల్లిలో వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష

Khammam Dist, Mango News, Nirudyoga Nirahara Deeksha, Nirudyoga Nirahara Deeksha at Penuballi, Penuballi, YS Sharmila, YS Sharmila Conducting Nirudyoga Nirahara Deeksha, YS Sharmila Conducting Nirudyoga Nirahara Deeksha at Penuballi, YS Sharmila Conducting Nirudyoga Nirahara Deeksha at Penuballi in Khammam Dist, YSRTP Chief YS Sharmila, YSRTP Chief YS Sharmila Conducting Nirudyoga Nirahara Deeksha, YSRTP Chief YS Sharmila Conducting Nirudyoga Nirahara Deeksha at Penuballi in Khammam Dist

రాష్ట్రంలో నిరుద్యోగ స‌మ‌స్య‌ను రూపుమాపేందుకు కృషిచేయడం కోసం ప్రతి మంగళవారం నిరుద్యోగవారంగా ప‌రిగ‌ణించి నిరుద్యోగుల కోసం నిరాహారదీక్ష చేపట్టాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత మంగ‌ళ‌వారం (జూలై 13) వనపర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని తాడిప‌త్రి గ్రామంలో వైఎస్ షర్మిల దీక్ష‌ను చేప‌ట్ట‌గా, నేడు (జూలై 20, మంగళవారం) ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం, పెనుబల్లిలో నిరుద్యోగ నిరాహార దీక్షను చేపడుతున్నారు.

ముందుగా పెనుబల్లి మండలం గంగదేవిపాడులో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నాగేశ్వరరావు కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించారు. నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం పెనుబల్లి చేరుకొని నిరాహార దీక్షలో కూర్చొన్నారు. పెనుబల్లిలో వైఎస్ షర్మిల దీక్ష సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, నిరుద్యోగులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =