ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో ఇప్పటివరకు 16 రాష్ట్రాల్లో 147 పాజిటివ్ కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో 5 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, ఆంధ్రప్రదేశ్ లో ఒక కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో మార్చ్ 27న తన పుట్టిన రోజుల వేడుకల గురించి టాలీవుడ్ స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సంవత్సరం తన పుట్టిన రోజు వేడుకలు జరపవద్దని పేర్కొంటూ అభిమానులకు ఒక ప్రకటన విడుదల చేశారు. తన మీద ఉన్న ప్రేమ కారణంగా తన జన్మదిన వేడుకను పండుగలా జరపడానికి ఫ్యాన్స్ పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకోగలనని ఆయన తెలిపారు.
అయితే తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో తన అభిమానులందరూ తమవంతుగా ఈ వైరస్ గురించి ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పాలని, అదే ఈ ఏడాది అభిమానులు తనకిచ్చే అతిపెద్ద గిఫ్ట్ అవుతుందని పేర్కొన్నారు. ముందుగా రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అభిమానులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. పలువురు ప్రముఖ సెలబ్రిటీస్ కి ఆహ్వానాలు అందజేసి మార్చి 26న రవీంద్రభారతిలో గ్రాండ్ ఈవెంట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో తమ అభిమాన హీరో నిర్ణయంతో కొంత నిరాశ చెందినా, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రామ్ చరణ్ తీసుకున్న నిర్ణయాన్ని మెగాభిమానులు మెచ్చుకుంటున్నారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ, ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తామని వెల్లడించారు.
ఈ అంశానికి సంబంధించిన మరికొన్ని వార్తలు:
కరోనా వైరస్ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలి – పవన్ కళ్యాణ్
కరోనా ఎఫెక్ట్: మార్చ్ 19 నుంచి చిలుకూరు బాలాజీ టెంపుల్ మూసివేత
కరోనా ఎఫెక్ట్: షిరిడీ ఆలయం, తాజ్ మహల్ మూసివేత
కరోనా ఎఫెక్ట్: రైల్వే ప్లాట్ఫామ్ టికెట్ ధర పెంపు
దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం
కరోనా వైరస్ ముప్పు – కరోనా వైరస్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కరోనా అలర్ట్: పోస్టర్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం