ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి భూముల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారంలో ఏపీ సీఐడీ మాజీ మంత్రి పొంగూరు నారాయణ, ఆయన కుమార్తెల నివాసాల్లో శుక్రవారం నుంచి సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం రెండోరోజు మరోసారి వారి నివాసాల్లో అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా హైదరాబాద్లోని కొండాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లిలోని నివాసాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. గతంలో మాదాపూర్లోని నారాయణ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన సీఐడీ అధికారులు, తాజాగా కొండాపూర్లోని కోలా లగ్జరియా, గచ్చిబౌలిలోని మీనాక్షి బాంబూస్, కూకట్పల్లిలోని లోధా టవర్స్ తదితర ప్రాంతాల్లోని ఆయన కుమార్తెల నివాసాల్లో శుక్రవారం ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. రాజధాని మాస్టర్ ప్లాన్ అవకతవకలకు సంబంధించి తాము సోదాలు చేస్తున్నట్లు ఏపీ సీఐడీ అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో నారాయణ కుటుంబీకుల బ్యాంక్ స్టేట్మెంట్లు మరియు లావాదేవీల గురించి ఆరా తీస్తున్నట్లు సమాచారం. కాగా పలు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో తనిఖీలు చేపట్టిన సీఐడీ అధికారులు.. ఈ రోజు సాయంత్రం వరకూ సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE