కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా గత రెండు నెలలుగా లాక్డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్డౌన్ వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం పడడంతో ప్రభుత్వ ఉద్యోగులకు మార్చ్, ఏప్రిల్ నెలలకు సంబంధించి కొంత శాతం జీతాలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. మే నెల నుంచి ఉద్యోగులకు పూర్తిస్థాయిలో జీతాలు చెల్లించాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మే నెలకు సంబంధించి ఉద్యోగుల జీతాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం సీఎం వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఫైనాన్స్, ట్రెజరీ లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే గత రెండు నెలల జీతాల బకాయిలపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu