విశాఖపట్నం జిల్లాలోని కొయ్యూరు మండలంలో గ్రేహౌండ్స్ దళాలు, మావోయిస్టులకు మధ్య బుధవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో కొయ్యూరు మండలంలోని మంప పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కూంబింగ్ చేపట్టిన క్రమంలో తీగలమెట్ట వద్ద ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఆ ప్రాంతంలో కూంబింగ్ ఇంకా కొనసాగుతుండడంతో, ప్రాణనష్టం సహా తుది వివరాలు నిర్ధారించబడాల్సి ఉందని, ఘటనాస్థలికి అదనపు బలగాలను తరలిస్తునట్టు పోలీసులు తెలిపారు. అలాగే ఘటనాస్థలం వద్ద భారీగా ఆయుధాలును స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ