ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 27 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8 వ తేదీన చేపట్టనున్నట్టు గతంలో రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను బట్టి ఈ కార్యక్రమాన్ని జూలై 8 న చేపట్టాలని భావించారు. అయితే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తదుపరి తేదీని కూడా ప్రభుత్వం ఈ రోజే ప్రకటించే అవకాశమున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu