ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని బుధవారం నాడు క్యాంపు కార్యాలయంలో భారత్ అండర్-19 క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్ కలిశారు. గుంటూరు జిల్లాకు చెందిన రషీద్ భారత్ అండర్-19 ప్రపంచ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ రషీద్ ను అభినందించి, పలు ప్రోత్సహకాలు ప్రకటించారు. రషీద్ కు ఏపీ ప్రభుత్వం తరఫున రూ.10 లక్షలు బహుమతి, గుంటూరులో ఇంటి స్థలం కేటాయింపుతో పాటుగా భవిష్యత్ లో కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు. షేక్ రషీద్ డిగ్రీ పూర్తి చేయగానే సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఇవ్వాలని, ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
అలాగే రషీద్ కు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరఫున ప్రకటించిన రూ.10 లక్షల చెక్కును సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రషీద్ తండ్రి బాలీషా, రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు మరియు శాప్ అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ