ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైస్సార్సీపీ నుంచి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీ, మోపిదేవి వెంకటరమణ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యసభకు ఎన్నికైన వైస్సార్సీపీ సభ్యులు జూలై 22, బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హిందీలో ప్రమాణ స్వీకారం చేయగా, ఆ తర్వాత పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ తెలుగులో ప్రమాణం చేశారు. మరో సభ్యుడు పరిమళ్ నత్వానీ వ్యక్తిగత కారణాలతో ఈ రోజు ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. అలాగే ఇటీవల 17 రాష్ట్రాలకు సంబంధించి రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన 55 మందిలో ఈ రోజు చాలామంది ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu