దేశంలో కరోనా వైరస్ రోజురోజుకి క్రమంగా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా అన్ని దేశీయ విమాన సర్వీసులను మార్చ్ 24, మంగళవారం అర్ధరాత్రి నుంచి రద్దు చేస్తున్నట్లు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ సోమవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది. తదుపరి నిర్ణయం ప్రకటించే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని చెప్పారు. అదేవిధంగా దేశంలో సేవలు అందిస్తున్న అన్ని విమానయాన సంస్థలు మంగళవారం రాత్రి 11.59 గంటల కల్లా తమ సర్వీసులను గమ్యస్థానాలకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. మరోవైపు రవాణా నేపథ్యంలో నడిచే కార్గో విమాన సర్వీసులపై ఎలాంటి ఆంక్షలు లేవని తెలియజేశారు. కాగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై మార్చ్ 22 నుంచి కేంద్ర ప్రభుత్వం వారం రోజుల పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
ఈ అంశానికి సంబంధించిన మరికొన్ని వార్తలు:
దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో పూర్తిస్థాయి లాక్డౌన్
కరోనా ఎఫెక్ట్ : లోక్సభ, రాజ్యసభ నిరవధిక వాయిదా
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు వాయిదా
కరోనా ఎఫెక్ట్: రాజ్యసభ ఎన్నికలు వాయిదా